నిర్మల్‌ జిల్లాలో ఇద్దరి దారుణహత్య

7 Dec, 2018 14:06 IST|Sakshi
దస్తూరాబాద్‌: భీమరాజు మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎస్సై

దస్తూరాబాద్‌ మండలం రేవోజీపేటలో ఒకరు

పెంబి మండలం కొలాంగూడలో మరొకరు

దస్తురాబాద్‌(ఖానాపూర్‌): మండలంలోని రేవోజిపేట్‌ గ్రామానికి చెందిన లింగంపల్లి భీమరాజు (29) గురువారం దారుణహత్యకు గురయ్యాడు. ఎస్సై గుమ్ముల అశోక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రేవోజిపేట గ్రామానికి చెందిన భీమరాజు చికెన్‌ సెంటర్‌ నడిపిస్తూ  జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన గౌరిని వివాహం చేసుకుని అత్తగారి ఇంటివద్దే ఉంటున్నాడు. ప్రతీరోజులాగే రాత్రికి చికెన్‌ సెంటర్‌ వద్ద పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన భీమరాజు ఇంటి బయట గడ్డివాములో నిద్రించాడు. అర్థరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు రోకలిబండతో తలపై బలంగా మోపి దారుణంగా హత్య చేశారు. గురువారం ఉదయం ఇంట్లోని వారు లేచి చూడగా భీమరాజు రక్తం మడుగులో శవకమై కనిపించాడు. కుటుంబ సభ్యులు గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటన స్థలానికి ఖానాపూర్‌ సీఐ అశోక్, క్రైమ్‌ బ్రాంచ్‌ సీఐ శ్రీనివాస్‌ తదితరులు చేరుకుని ప్రాథమిక విచారణ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

పాతకక్షలతో ..
ఖానాపూర్‌: నిర్మల్‌ జిల్లా పెంబి మండలం పస్పుల పంచాయతీ పరిధిలోని కొలాంగూడలో పాతకక్షల కారణంగా ఒకరు హత్యకు గురైన సంఘటన మండలంలో సంచలనం రేపింది. సీఐ ఆకుల అశోక్, ఎస్సై కాశవేని సంజీవ్‌లు తెలిపిన వివరాల ప్రకారం...కొలాంగూడకు చెందిన చీకటి గంగరాం(55)కు వరుసకు బావమరిది అయిన టేకం తుకారాంకు మధ్య కొంతకాలంగా పాత కక్షలు ఉన్నాయి. బుధవారం సాయంత్రం పొలం నుంచి ఇంటికి వచ్చే క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో గంగారాం రాయి తో తుకారాంను కొట్టడంతో అతనికి గాయాలయ్యాయి. వెంటనే కోపోద్రిక్తుడైన తుకా రాం గొడ్డలితో గంగారాం మెడపై విచక్షణా రహితంగా నరికాడు. దీంతో గంగా రాం అక్కడికక్కడే మృతి చెందాడు. అతనికి భార్య పద్మ, ముగ్గురు కుమారులు, ఒక కూ తురు ఉన్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. మృతుని కుమారుడు రవి ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నామని సీఐ పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు