రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు

16 Jul, 2018 13:59 IST|Sakshi
నుజ్జునుజ్జుగా మారిన ఆటో   

మూసాపేట (దేవరకద్ర) : జాతీయ రహదారి పై ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరికి ముగ్గురు గాయపడ్డారు. ఈ సంఘటన మండలంలోని సంకలమద్దిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ లక్ష్మయ్య కథనం ప్రకారం.. సంకలమద్ది గ్రామానికి చెందిన బాలస్వామి, వెంకటేష్, నాగరాజులు శనివా రం రాత్రి కలిసి ఆటోకు డీజీల్‌ నింపుకొని వ స్తుండగా వెనకాల నుంచి వచ్చిన గుర్తుతెలి యని వాహనం ఆటోను వేగంగా ఢీకొట్టి వెళ్లిపోయింది.

ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా.. ఆ టో వెనక భాగం నుజ్జునుజ్జుగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను మహబూబ్‌నగర్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.  అయితే ఈ ప్రాంతంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయా ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతుండగా.. మరెందరో అవిటివారిగా మారి దుర్భరంగా జీవిస్తున్నారు.

మరిన్ని వార్తలు