హైదరాబాద్‌లో స్వైన్ ఫ్లూ పంజా.. ఇద్దరు మృతి

14 Mar, 2019 20:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మండు వేసవిలోనూ స్వైన్‌ ఫ్లూ పంజా విసురుతోంది. గురువారం స్వైన్‌ ఫ్లూతో బాధపడుతూ ఇద్దరు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. మార్చి 1న 24ఏళ్ల ఓ యువతి, 6వ తేదీన 80ఏళ్ల వృద్ధురాలు స్వైన్‌ ఫ్లూ లక్షణాలతో హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో చేరారు. అయితే వీరు అంతకుముందు ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆరోగ్యం కుదుటపడకపోవటంతో గాంధీ ఆసుపత్రిని ఆశ్రయించారు.

గాంధీలో చికిత్సపొందుతూ వ్యాధి తీవ్రమవటంతో ఈ గురువారం ఇద్దరూ మృతిచెందారు. ఇంకా 5మంది స్వైన్‌ ఫ్లూ రోగులు గాంధీలో చికిత్స పొందుతున్నారు. మరో నలుగురికి కూడా స్వైన్‌ ఫ్లూ ఉన్నట్లు వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారికి సంబంధించిన వైద్య నివేదికలు మరో రెండు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు