వాటర్‌ ట్యాంకులో రెండు శవాలు

6 Jun, 2020 20:41 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ముంబై : నగరంలోని ఓ రెస్టారెంట్‌ బార్‌లోని వాటర్‌ ట్యాంకులో అక్కడే పనిచేస్తున్న ఇద్దరు వెయిటర్ల మృతదేహాలు వెలుగుచూశాయి. ఈ సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నరేశ్‌ పండిట్‌(52), హరీష్‌ శెట్టి ఇద్దరూ మీరారోడ్‌లోని రెస్టారెంట్‌ బార్‌ శబరీలో వెయిటర్లుగా పనిచేస్తున్నారు. అయితే వారు కొద్దిరోజులుగా కనిపించటం లేదు. ఈ నేపథ్యంలో రెస్టారెంట్‌ బార్‌ ఓనర్‌ గంగాధర శెట్టి వాటర్‌ ట్యాంకునుంచి దుర్వాసన రావటంతో తెరిచి చూడగా శవాలు కనిపించాయి. వాటిని బయటకు తీసి చూడగా, మృతదేహాలపై కత్తిగాట్లు దర్శనమిచ్చాయి. ( చెకప్‌ కోసం ఆస్పత్రికెళ్లిన మహిళపై..)

దీంతో ఆయన పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మృతులిద్దరూ గత వారంరోజుల నుంచి కనిపించటం లేదని, చివరిసారిగా వారిని గత సోమవారం చూశానని గంగాధర శెట్టి‌ పోలీసులకు తెలిపారు. వారం రోజులనుంచి కనిపించకుండా పోయిన ఓ వెయిటర్‌పై అనుమానం వ్యక్తం చేశారు. పరారీలో ఉన్నాడని భావిస్తున్న అనుమానితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.

మరిన్ని వార్తలు