ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నేరస్తుల హతం

17 Feb, 2020 08:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మర్డర్‌ వంటి తీవ్ర నేరాల్లో ప్రమేయమున్న ప్రమేయుమున్న ఇద్దరు నేరస్తులు సోమవారం ఉదయం దేశ రాజధానిలో జరిగిఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. మరణించిన ఇద్దరు క్రిమినల్స్‌ను రాజా ఖురేషి, రమేష్‌ బహదూర్‌లుగా గుర్తించారు. ఖురేషి, బహదూర్‌ల కోసం కరవాల్‌నగర్‌ మర్డర్‌ కేసు సహా పలు కేసుల్లో ఢిల్లీ పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌పై మరిన్ని వివరాలను తర్వాత వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

చదవండి : దిశ నిందితుల ఎన్‌కౌంటర్.. ముగిసిన తొలిరోజు విచారణ

>
మరిన్ని వార్తలు