బావిలో పూడిక తీస్తూ ఇద్దరు కూలీలు మృతి

13 Sep, 2019 17:57 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: కాకినాడలో విషాదం చోటు చేసుకుంది. అచ్యుతాపురం రైల్వే గేటు సమీపంలో పాడుబడిన బావిలో పూడిక తీస్తూ ఇద్దరు కూలీలు దుర్మరణం పాలయ్యారు.బావి ఇటుకలు మీద పడటంతోనే వారు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని  మృతదేహాలను వెలికితీస్తున్నారు.

మరిన్ని వార్తలు