సెల్ఫోన్ లొకేషన్ ఆధారంగా కూపీ
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్లో దొంగల గుర్తింపు
మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న జిల్లా పోలీసులు అంతర్ జిల్లానే కాదు.. అంతర్ రాష్ట్ర దొంగల గుట్టురట్టు చేశారు. సిద్దిపేటలో నేరం చేసిన వారిని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ ప్రాంతానికి చెందిన టైర్ల దొంగలుగా గుర్తించారు. వీరిని సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పట్టుకున్నారు. ప్రస్తుతం వేలిముద్రలు, సీసీ కెమెరాలు, ఫేస్ రికగ్నైజ్డ్ సిస్టం(ఎఫ్ఆర్ఎస్) తదితర సాధనాలే నేరస్తులను పట్టుకునేందుకు కీలకంగా మారాయి.
సాక్షి, సిద్దిపేట: జిల్లాలోని కోహెడ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన తాటిపాముల రమేశ్ సెప్టెంబర్ 21న ఆ గ్రామ శివారులో లారీని ఉంచి ఇంటికి వెళ్లి నిద్రపోయాడు. ఉదయం లేచి చూసేసరికి లారీ కనిపించలేదు. ఈ విషయాన్ని కోహెడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు బస్వాపూర్ నుంచి లారీని చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ గ్రామ సమీపంలోకి తీసుకెళ్లి ఆ లారీకి ఉన్న 14 టైర్లు, డెక్స్, బ్యాటరీ, ఇతర సామగ్రిని తేసుకెళ్లారు. మొత్తం రూ.10 లక్షల విలువగల వస్తువులను దొంగిలించారు.
సిగ్నల్ ఆధారంగా గుర్తింపు
నూతన పరిజ్ఞానంతో సులభం
నూతన సాంకేతిక పరిజ్ఞానం, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ఉద్యోగుల సహకారంతో నేరస్తులను పట్టుకోవడం సులభతరం అవుతోంది. జిల్లాలోని 420 గ్రామాలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. టెలికమ్యూనికేషన్ రంగం ద్వారా పలు విషయాలను సేకరించాం. వేలి ముద్రల సేకరణ ఇతర అన్ని అవకాశాలు సద్వినియోగం చేసుకొంటున్నాం. దీంతో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. –జోయల్ డేవిస్, పోలీస్ కమిషనర్
సాంకేతిక పరిజ్ఞానం కేసులు రికవరీ
సీసీ కెమెరాల ద్వారా 85 కేసులు రూ. 65లక్షలు
వేలి ముద్రల ద్వారా 33 కేసులు రూ. 40లక్షలు
ఎఫ్ఆర్ఎస్ సిస్టం 10 కేసులు రూ. 3.70లక్షలు
ఛేదించిన కేసుల వివరాలు
సీసీ కెమెరాల ద్వారా 85 కేసులు
వేలి ముద్రల ద్వారా 33 కేసులు
ఎఫ్ఆర్ఎస్ సిస్టం 10 కేసులు