ప్రమాదంలో కేంద్ర మంత్రికి గాయాలు

31 Dec, 2017 14:26 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్‌కు యాక్సిడెంట్‌లో గాయాలయ్యాయి. ఆదివారం ఉదయం అలహబాద్‌లో ఆమె ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లో వాహనాలు ఒకదాంతో మరొకటి ఢీకొట్టాయి. 

ప్రమాదంలో ఆమెకు స్వల్ప గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. 

మరిన్ని వార్తలు