చింతామణి: గుర్తుతెలియని దుండగులు 10 కోతులను హతమార్చిన ఘటన తాలుకాలోని పెద్దూరు దగ్గర వున్న కోనపల్లి క్రాస్ దగ్గర శుక్రవారం వెలుగు చూసింది. ఉదయం ఆ మార్గంలో వెళ్తున్నవారు విగతజీవులుగా ఉన్న వానరాలను గమనించి అటవీ శాఖ అధికారి జయచంద్రకు సమాచారం ఇచ్చారు. ఆయన వచ్చి పరిశీలించగా వానరాల శరీరంపై గాయాలు కనిపించాయి. దీంతో వానరాలను ఇతర ప్రాంతాల్లో చంపివేసి ఇక్కడ పారవేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం గ్రామస్తులు వానరాలకు పూజలు చేసి ఖననం చేశారు.