ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. పసికందును పూడ్చిపెట్టిన వైనం

28 May, 2020 14:14 IST|Sakshi

లక్నో: ఉత్తప్రదేశ్‌ సిద్ధార్థ్ నగర్ జిల్లాలోని సోనౌరా గ్రామంలోని కొందరు ప్రజలకు ఓ హృదయవిదారకర ఏడుపు వినిపించింది. ఎవరో చిన్న బిడ్డ ఊపిరి తీసుకోవడానికి కూడా వీలు లేక ఏడుస్తున్నట్లు తోచింది. దాంతో గ్రామస్తులు ఆ ఏడుపు వినిపించే దిశగా ప్రయాణం చేసి నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్‌ దగ్గర ఆగారు. చుట్టూ పరికించి చూడగా ఇసుక, మట్టి కలిసిన ఓ దిబ్బ దగ్గర వారి చూపు ఆగిపోయింది. అక్కడ వారికి ఓ పసికందు కాలు కనిపించింది. దాంతో జనం జాగ్రత్తగా ఆ దిబ్బను తవ్వి చూడగా ఓ నవజాత శిశువు కనిపించింది. వెంటనే ఆ పసివాడిని వెలికి తీసి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఆ చిన్నారిని శుభ్రం చేసి తగిన చికిత్స చేశారు. ప్రస్తుతం పిల్లాడు క్షేమంగానే ఉన్నాడని.. కాకపోతే కాస్తా బురదను మింగాడని ప్రమాదం ఏం లేదని తెలిపారు వైద్యులు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకుని కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు