పోలీసుల కస్టడీకి వరవరరావు

19 Nov, 2018 05:49 IST|Sakshi

పుణే: మావోయిస్టులతో సంబంధాల కేసులో విరసం సభ్యుడు వరవరరావును మహారాష్ట్రలోని ఓ కోర్టు నవంబర్‌ 26 వరకూ పోలీసుల కస్టడీకి అప్పగించింది. సుప్రీంకోర్టు ఈ నెల 15వరకూ విధించిన గృహనిర్బంధం ముగిసిన నేపథ్యంలో శనివారం ఉదయం పుణే పోలీసులు హైదరాబాద్‌లో వరవరరావును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పుణేలోని జిల్లా సెషన్స్‌ జడ్జి కిశోర్‌.డి.వదనే ముందు ఆదివారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది ఉజ్వల పవార్‌ వాదిస్తూ.. గణపతి రహస్య స్థావరాలతో పాటు మావోల లేఖల్లో ఉన్న కోడ్‌భాషపై విచారించేందుకు వరవరరావును 14 రోజుల కస్టడీకి అప్పగించాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం 9 రోజుల పాటు వరవరరావును పోలీసుల కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

మరిన్ని వార్తలు