బాధితురాలు..నిందితుడికి  పోలీస్‌ స్టేషన్‌లో వివాహం 

19 Jun, 2018 12:58 IST|Sakshi
బాధిత మహిళా హోమ్‌గార్డును పోలీసుల సమక్షంలో వివాహమాడుతున్న జవాన్‌ తరిణి మహేంద్ర  

బరంపురం : గంజాం జిల్లాలోని బల్లిగుడ ప్రాంగణంలో ఓ మహిళా హోమ్‌గార్డుపై జవాన్‌ అత్యాచారానికి పాల్పడిన సంఘటనలో బాధి త మహిళకు నిందితుడితో పోలీసులు సోమవారం వివాహం జరిపిం చారు. వివరాలిలా ఉన్నాయి. కొందమాల్‌ జిల్లా బల్లిగుడ పోలీస్‌స్టేషన్‌లో హోమ్‌గార్డుగా విధులు నిర్వహిస్తున్న మహిళపై..జవాన్‌ తరిణి మహేంద్ర అత్యాచారానికి ఒడిగట్టాడు.

ఈ సంఘటనపై బాధిత మహిళా హోమ్‌గార్డు సంబంధిత పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేసిన పోలీసులు బాధితురాలితో నిందితుడు తరిణి మహేంద్రకు రాజీ కుదిర్చి సోమవారం జి.ఉదయగిరి పోలీస్‌స్టేషన్‌లో ఇద్దరికీ సంప్రదాయబద్ధంగా వివాహం జరిపించారు.   

 

మరిన్ని వార్తలు