ప్యాసింజర్‌ రైలుకు తప్పిన ప్రమాదం

14 May, 2019 20:06 IST|Sakshi

కృష్ణా జిల్లా: విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్తున్న ప్యాసింజర్‌ రైలుకు పెను ప్రమాదం తప్పింది. గుడ్లవల్లేరు మండలం వడ్లమానాడు వద్ద ప్యాసింజర్‌ రైలు, పట్టాలపై ఉన్న గేదెలను ఢీకొట్టడంతో నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. అదృష్టం బాగుండి ప్రయాణికులకు ఏంకాలేదు. రైలు వేగం తక్కువగా ఉండటం వల్ల ప్రమాదం తప్పినట్లు రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఈ సంఘటన గురించి రైల్వే అధికారులకు సమాచారమిచ్చారు.

మరిన్ని వార్తలు