నెల్లూరు జిల్లాలో దారుణం

4 Jul, 2018 16:15 IST|Sakshi

సాక్షి, నెల్లూరు : భార్య తనను మోసం చేసి.. మరో వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించడం ఆ వ్యక్తి సహించలేకపోయాడు. భార్య, ప్రియుడు తన గుడిసెలో ఉన్న సమయంలో ఆ విషయాన్ని పసిగట్టి.. కిరాతకానికి ఒడిగట్టాడు. తన భార్య, ఆమె ప్రియుడి ఇంట్లో ఉన్న సమయంలో బయటినుంచి గొళ్లెం పెట్టి.. విచక్షణారహితంగా పెట్రోల్‌ పోసి తగులబెట్టాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కోళ్లమిట్టలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో మహిళ, ఆమె ప్రియుడు ఇద్దరు సజీవ దహనమైపోయారు. వారు మృతదేహాలు గుర్తుపట్టరానంతగా దహనమయ్యాయి. 

పోలీసుల వివరాల ప్రకారం కోళ్లమిట్టకు చెందిన హరిబాబుకు కవితకు ఐదేళ్ల కిందట పెళ్లయింది. కవితకు మరో వ్యక్తితో వివాహేతరం సబంధం ఉంది. ఈ వివాహేతరం సంబంధం గురించి గతంలోనే తెలుసుకున్న హరిబాబు భార్యను మందలించాడు. ఈ విషయంలో గొడవలు జరిగాయి. గ్రామంలో కూడా ఈ విషయమై పంచాయతీ జరిగిటన్టు తెలుస్తోంది. అయినా, భార్య కవిత ధోరణిలో మార్పురాలేదు. ప్రియుడితో ఆమె వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న విషయాన్ని హరిబాబు గమనించాడు. ఈ క్రమంలో హరిబాబు బుధవారం బయటకు వెళ్లిన సమయంలో అతని ఇంటికి కవిత ప్రియుడు వచ్చాడు. కవిత, ఆమె ప్రియుడి ఇంట్లో ఉన్న సమయంలో హరిబాబు ఈ విషయం తెలిసిందే. వెంటనే ఇం‍టికి చేరుకున్న అతను..  ఇద్దరు లోపల ఉన్న విషయాన్ని గుర్తించి బయట నుంచి గొళ్లెం పెట్టాడు. ఈ క్రమంలో పట్టరాని ఆగ్రహంతో కిరాతకుడిగా మారిన హరిబాబు పెట్రోలో పోసి గుడిసెకు నిప్పటించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత అతను సంఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. విషయం తెలియడంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసి.. నిందితుడి కోసం గాలిస్తున్నారు. వివాహేతర సంబంధమే ఇంతటి ఘోరానికి కారణమైందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు