శీతలపానీయంలో విషం కలిపి తాగించి..

16 Mar, 2019 09:18 IST|Sakshi
మృతదేహాలకు నివాళులర్పిస్తున్న బొల్లా శ్రీనివాసరావు

సాక్షి, వినుకొండ : వినుకొండ మండలం నీలగంగవరం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.  గ్రామానికి చెందిన రసూల్, సలోమి(35) దంపతులు బతుకు దెరువు కోసం తెలంగాణలోని సూర్యాపేట జిల్లా, మేళ్లచెరువు మండలం వెల్లటూరు పాలేనికి కొన్నేళ్ల కిందట వలస వెళ్లారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో బుధవారం సలోమి తన ఇద్దరు కుమారులైన విలియమ్‌ కేర్‌(12), బిలీగ్రామ్‌(8)లకు శీతలపానీయంలో విషం కలిపి తాగించి, తాను తాగి ఆత్మహత్యకు పాల్పడింది. అక్కడే పోస్టుమార్టం నిర్వహించి,  శుక్రవారం మృతదేహాలను స్వగ్రామమైన నీలగంగవరం గ్రామానికి తీసుకొచ్చారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సలోమి కుటుంబ సభ్యులను వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బొల్లా బ్రహ్మనాయుడు కుమారుడు బొల్లా శ్రీనివాసరావు పరామర్శించారు.  

మరిన్ని వార్తలు