సాక్షి, బెంగళూరు : తాగి వచ్చిన భర్తను చెంపపై కొట్టడంతో మృతి చెందిన ఘటన కర్నాటకలోని చామరాజనగర జిల్లాలో జరిగింది. ఉత్తువళ్లికి చెందిన ప్రభుస్వామి రోజు సాయంత్రం మద్యం తాగి ఇంటికి వచ్చేవాడు. ఎప్పుటిలాగే శనివారం రాత్రి కూడా మద్యం తాగి వచ్చాడు. దీంతో భార్య అంబికతో వాదులాటకు దిగాడు. అయన తిడుతున్నా మాటలను తట్టుకోలేక అంబిక మొగుడి చెంప చెల్లుమనిపించింది. దీంతో ప్రభుస్వామి అక్కడే కూప్ప కూలి మృతి చెందాడు. దీంతో భయపడిన అంబిక రాత్రి ప్రభుస్వామి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించింది. ప్రభుస్వామి తమ్ముడికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.