భార్యను చంపి.. ఆత్మహత్యాయత్నం

25 Jul, 2018 14:31 IST|Sakshi
సాయమ్మ మృతదేహం  

కోరుట్ల : జులాయిగా తిరుగుతూ అప్పులు పెరిగి.. మద్యం మత్తులో ఓ భర్త తన భార్యను పొడిచి చంపాడు. తాను పొడుచుకున్నాడు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం కోరుట్ల పట్టణంలో చోటు చేసుకుంది. కోరుట్ల సతీష్‌ చందర్‌రావు కథ నం ప్రకారం.. కరీంనగర్‌ పట్టణంలోని అల్లమయ్యగుట్ట కాల నీలో పేర్ల మల్లేశం(42)- సాయమ్మ(38) దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు.

ఈ కుటుంబం కూలీనాలీతో పొట్ట పోసుకు ని జీవనం గడుపుతున్నారు. కొంతకాలంగా మల్లే శం ఏ పని చేయకుండా తిరుగుతున్నాడు. సాయ మ్మ కుటుంబభారాన్ని చూసుకుంటోంది. ఈ క్రమంలో మల్లేశం మద్యానికి బానిసయ్యాడు. కు టుంబపోషణ.. మద్యం కోసం చేసిన అప్పులు సుమారు రూ.లక్షకు మించిపోయాయి. దీంతో తరుచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం మల్లేశం భార్య సాయమ్మతో గొడవకు దిగాడు. వివాదం పెరగడంతో కత్తితో సాయమ్మ డొక్కలో పొడిచాడు. సాయమ్మ అక్కడిక్కడే చనిపోయింది. అన ంతరం మల్లేశం అదే కత్తితో ఛాతీతో పొడుచు కోగా స్వల్పగాయాలు అయ్యాయి. మల్లేశంను ఆ సుపత్రికి తరలించి చికిత్స అందించిన తరువాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటన స్థలాన్ని సీఐ సతీష్‌ చందర్‌రావు, ఎస్సై రవికుమార్‌ పరిశీలిచి.కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు