చెన్నై,అన్నానగర్: బాలింత అయిన భార్యని తక్షణమే తన వెంట పంపమని మామగారి ఇంట్లో గొడవకు దిగిన అల్లుడికి అత్తమామలు దేహశుద్ధి చేశారు. తంజావూర్ సమీపంలోని రెడ్డి పాళ్యం మేట్టు వీధికి చెందిన జయశీలన్ (28). అదే ప్రాంతానికి చెందిన మారిముత్తు కుమార్తె దేవికా. ఈమె, జయశీలన్ ప్రేమించి రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. ఈ స్థితిలో దేవికా గర్భం దాల్చింది. ప్రసవం కోసం తల్లిదండ్రులకు వద్దకు వెళ్లింది. ప్రసవం ముగిసి బిడ్డతో దేవికా, కన్నవారు, సహోదరుడు దేవాతో ఇంట్లో ఉంది.
గురువారం జయశీలన్, మామ మారిముత్తు ఇంటికి వెళ్లి భార్య, బిడ్డని పంపించాలని కోరాడు. దానికి దేవికా బాలింత అని మరో నెల రోజులు తరువాత పంపిస్తానని మారిముత్తు తెలిపాడు. దీంతో జయశీలన్ అత్తామామలతో గొడవకు దిగాడు. దీంతో మారిముత్తు కుటుంబ సభ్యులు జయశీలన్కు దేహశుద్ధి చేశారు. ఈ గొడవలో దేవాకి గాయమయింది. ఇద్దరు తంజావూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన గురించి పోలీసులు విచారణ చేస్తున్నారు.