ఆగ్రా : తన భార్య తనకు పాలల్లో విషం కలిపి ఇచ్చిందని యూపీలోని ఆగ్రాకు చెందిన ఓ వ్యక్తి తాను మరణించే ముందు వీడియోలో రికార్డు చేయడం కలకలం రేపింది. బాధిత వ్యక్తిని అవధేష్గా పోలీసులు గుర్తించారు. నాలుగు రోజుల కిందట అవధేష్ ఇంటికి వచ్చిన అత్తామామలు అతడితో ఘర్షణకు దిగారని, అవధేష్ను వారు చితకబాదారని తెలిసిందని పోలీసులు చెప్పారు.
కుటుంబ కలహాల నేపథ్యంలో అవధేష్తో ఘర్షణకు దిగారని వెల్లడించారు. కాగా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, బాధ్యులపై చర్యలు చేపడతామని సీనియర్ పోలీస్ అధికారి అమిత్ పాధక్ తెలిపారు.