పోలీసులకు లైంగిక ఎర

21 Sep, 2019 10:27 IST|Sakshi

మహిళ సహా నలుగురి అరెస్టు

తమిళనాడు, టీ.నగర్‌: మదురైలో పోలీసులను వ్యభిచారానికి ఆహ్వానించిన మహిళ సహా నలుగురిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మదురైలో కిడ్నాప్‌ల నిరోదక విభాగం పోలీసు కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు తిరుపతి. ఇతనికి గురువారం సెల్‌ఫోన్‌లో ఒక ఎస్‌ఎంఎస్‌ వచ్చింది. మహిళలతో జల్సాగా గడపాలనుకుంటే ఈ కింది నెంబర్‌కు సంప్రదించాలని అందులో పేర్కొన్నారు. ఈ నెంబర్‌ ఆధారంగా తిరుపతి అక్కడికి వెళ్లగా సుబ్రమణి అనే వ్యక్తి తనను పరిచయం చేసుకున్నాడు.

అక్కడ బేరసారాలు జరిగిన తర్వాత తిరుపతి వద్ద అక్కడున్న ముఠా నగదు లాక్కుని ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని బెదిరించారు. తర్వాత ఒక మహిళను అతనితో పాటు ఒక గదికి పంపారు. ఈ లోపున తిరుపతి మరుగుదొడ్డికి వెళ్లి వస్తానని చెప్పి, అక్కడి నుంచి పోలీసులకు సమాచారం తెలిపారు. దీంతో హుటాహుటిన అక్కడికి వచ్చిన పోలీసులు వ్యభిచారం జరుపుతున్న అయ్యనార్, శేఖర్, మనోజ్‌ కుమార్‌తో సహా నందిని అనే మహిళను అరెస్టు చేశారు.

మరిన్ని వార్తలు