పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రిన్సిపాల్ భార్య
ఉప్పల్: కట్టుకున్న భార్య ఉండగానే పలువురితో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తూ సహజీవనం చేస్తున్న తన భర్తపై చర్యలు తీసుకోవాలని ఓ మహిళ..తన భర్తపై ఫిర్యాదు చేసింది. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాడని వాపోయింది. రామంతాపూర్లోని ఓ ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్ వ్యవహారాన్ని ఆయన భార్య బట్టబయలు చేసింది. ఉప్పల్ పోలీస్స్టేషన్లో రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేసింది. పోలీసులు, భాదితురాలు పుష్పలీల తెలిపిన మేరకు.. 24 సంవత్సరాల క్రితం పారిజాతం స్కూల్ ప్రిన్సిపల్ అనంతరామన్గౌడ్కు పుష్పలీలతో వివాహం జరిగింది.
వారికి ఇద్దరు కుమార్తెలు. భార్యతో ఉంటూనే 2009లో సరిత అనే మహిళను వివాహం చేసుకొని కొన్ని నెలల కాపురం చేసిన తర్వాత పంచాయితీ పెట్టి వదిలేశాడు. ఇదే కాకుండా 2015లో స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయురాలు తో సహజీవనం చేస్తూ తనను, తన పిల్లలను ఇబ్బందులు పెట్టేవాడని ఆమె వాపోయింది. ఇదిలా ఉండగానే మ్యారేజ్బ్యూరో ద్వారా ఓయువతితో సహజీవనం చేస్తున్నాడని రోజుల తరబడి ఇంటికి రాకుండా ఉండటంతో అనుమానం వచ్చి ఆరా తీస్తే అసలు విషయం బయటపడిందని దీంతో ఉప్పల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు భార్య పుష్పలీల తెలిపింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.