పురుగుమందు తాగి మహిళ ఆత్మహత్య

1 Feb, 2018 06:03 IST|Sakshi
సుకన్య మృతదేహం

మనుబోలు: పురుగు మందు తాగి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండలంలోని కొండూరుసత్రంలో బుధవారం జరిగింది. పోలీసులు కథనం మేరకు.. కొండూరుసత్రంకు చెందిన కంటాబత్తిన రామసుబ్బయ్య కుమార్తె సుకన్య (27) అదే గ్రామానికి చెందిన చిరంజీవి అనే వివాహితుడితో పదేళ్లుగా సహజీవనం చేస్తోంది. చిరంజీవికి  భార్య, పెళ్లీడుకొచ్చిన పిల్లలు ఉన్నప్పటికీ వారికి దూరంగా ఉంటూ సుకన్యతోనే ఉంటున్నాడు. అ యితే ఏడాది క్రితం ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు.

అప్పటి నుంచి చిరంజీవి భా ర్య, పిల్లలతో కలిసి ఉంటున్నాడు. నాలుగు రోజుల క్రితం చిరంజీవి మళ్లీ సుకన్యతో కలిసి నెల్లూరులోని షాపింగ్‌మాల్‌లో కనిపించడంతో ఆయన కుమారులు నిలదీశారు. దీంతో రెండు కుటుంబాల మధ్య గొడవలు రేగాయి. ఈ నేపథ్యంలో ఏమి జరిగిందో తెలియదు కానీ బుధవారం ఉదయం సుకన్య పురుగు మందు తాగి అపస్మారక స్థితిలో చెరువు వద్ద పడిపోయి ఉంది. స్థానికులు గుర్తించి 108కి సమాచారమందించి ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందింది. ఏఎస్సై సుబ్బారావు ఘటనా స్థలాన్ని స్థలాన్ని పరిశీలించి, సుకన్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు