వ్యక్తిగత కారణాలతో మహిళ ఆత్మహత్య

30 May, 2018 13:37 IST|Sakshi

సాక్షి, విజయనగరం : జిల్లాలోని కురుపాం గ్రామానికి చెందిన పత్తిక మణిమాల(30) పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక బుధవారం మృతి చెందింది. ఈమె భర్త  శంకర్‌ రావు వృత్తి రీత్యా టీచర్.  ఇతను గుమ్మలక్ష్మీపురం మండలం అచ్చబా గ్రామంలో మండలపరిషత్ స్కూల్‌ టీచర్‌గా పనిచేస్తున్నాడు. కొన్ని రోజులుగా భార్య, భర్తల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరుగుతున్నాయి. శంకర్‌ రావే తన భార్యను చంపి, దాన్ని ఆత్మహత్యగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు