జామకాయలు కోస్తుండగా..

24 Dec, 2017 16:01 IST|Sakshi

సాక్షి, చొప్పదండి: కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలం వెదురుగట్ట గ్రామంలో విషాద సంఘటన జరిగింది. బంధువుల ఇంటికి చుట్టపు చూపుగా వచ్చిన ఓ మహిళ విద్యుదాఘాతానికి గురై మృతిచెందింది. మానకొండూరు మండలం లింగాపూర్‌ గ్రామానికి చెందిన దాసరి గంగ(38) వెదురుగట్ట గ్రామంలో బోనాలు పెట్టుకుంటే చూసిపోదామని బంధువుల ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో భవనం పైకి ఎక్కి జామకాయలు తెంపుతుండగా విద్యుత్‌ తీగలు తగిలి ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. బంధువుల, మృతురాలి కుటుంబంలో విషాదం అలుముకుంది.

మరిన్ని వార్తలు