లాడ్లీ మృతి.. భర్తపై అనుమానం

27 Jan, 2018 11:15 IST|Sakshi
ఐదో అంతస్తుపైనుంచి పడిన లాడ్లీ

అనుమానాలు వ్యక్తం చేసిన మృతురాలి తండ్రి

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని కూకట్‌పల్లిలో లాడ్లీ అనే 24 ఏళ్ల వివాహిత.. అపార్ట్‌మెంట్‌పైనుంచి పడి చనిపోయిన ఘటన కలకలం రేపుతోంది. కూకట్‌పల్లిలోని శ్రీనిధి గార్డెన్స్‌లో సాయి ముదిరాజ్‌, అతని భార్య లాడ్లీ ఉంటున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఐదో అంతస్తుపైనుంచి లాడ్లీ కిందపడి తీవ్రంగా గాయపడింది. వెంటనే స్థానికులు గుర్తించి ఆమెను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ కన్నుమూసింది.

ఆమె భర్త సాయి ముదిరాజ్‌.. ఆ విషయాన్ని భార్య తండ్రి రాజేష్‌ భండారీకి సమాచారం అందించాడు. అయితే తన కూతురు చావుకు సాయి ముదిరాజ్‌, అతని కుటుంబ సభ్యులే కారణమని లాడ్లీ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె మృతికి తాను కారణం కాదని, ఆడుకుంటూ ఆడుకుంటూ తమ పెంపుడు కుక్క హఠాత్తుగా మీది పడటంతో అయిదో అంతస్తుపైనుంచి తన భార్య పడిపోయిందని సాయి ముదిరాజ్‌ చెప్తున్నాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు