దివ్యాంగుడైన భర్త కళ్లెదుటే భార్యను..

12 Aug, 2019 15:43 IST|Sakshi
వివరాలు తెలియజేస్తున్న బోక్‌పార పోలీసు అధికారి

దిస్పూర్‌ : దివ్యాంగుడైన భర్త కళ్లెదుటే ఓ భార్య అత్యాచారానికి గురైంది. ఈ సంఘటన శనివారం  మధ్యాహ్నం అస్సాంలోని బోక్‌పారలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బోక్‌పారకు చెందిన వివేక్‌ కున్వర్‌, త్రిశాంత్‌ శర్మ, భాస్కర్‌ బోర్గోహాయ్‌లు శనివారం మధ్యాహ్నం ఓ ఇంటి వద్దకు వెళ్లి తలుపు తట్టారు. ఇంట్లోనుంచి బయటకు వచ్చిన దివ్యాంగుడు వారిని ‘ఏం కావాలి’ అని అడిగాడు. వారు ‘దాహంగా ఉంది తాగటానికి నీళ్లు ఇవ్వండి’ అని అడగటంతో అతడు లోపలకు వెళ్లాడు. ఆ వెంటనే ఇంట్లోకి చొరబడ్డ ముగ్గురు దివ్యాంగుడిని గాయపరిచి అతడి భార్యపై అత్యాచారం జరిపారు.

బాధితురాలు వారినుంచి తప్పించుకోవటానికి ఎంత ప్రయత్నించినా ఆమె వల్లకాలేదు. అత్యాచారం అనంతరం ఆ ముగ్గురు అక్కడినుంచి పరారయ్యారు. దంపతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు