కన్నోడు.. కట్టుకున్నోడు కలిసి కడతేర్చారు

31 Aug, 2019 11:44 IST|Sakshi
సునీత మృతదేహం 

సాక్షి, పెద్దపల్లి : పెద్దపల్లి మండలం చందపల్లి శివా రులోని గుంటూరుపల్లిలో గురువారం రాత్రి దుగ్యంపూడి సునీత(38)ను ఆమె తండ్రి సాంబి రెడ్డి, భర్త రవీందర్‌రెడ్డి కర్రలతో చితకబాది హ తమార్చారు. సునీతకు అదే గ్రామానికి చెందిన యువకుడితో వివాహేతర సంబంధం ఉందనే నెపంతో సాయంత్రం భర్త రవీందర్‌రెడ్డి దాడిచేశాడు. విషయాన్ని రవీందర్‌రెడ్డి తన మామ సాంబిరెడ్డికి చేరవేశాడు. గాంధీనగర్‌ నుంచి అతడు కూతురు ఇంటికి చేరుకున్నాడు. ఇద్ద రు కలిసి మరోసారి దాడిచేయడంతో తీవ్రంగా గాయపడింది. అదే రాత్రి ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయింది. మృతదేహానికి శుక్రవారం పోస్టుమార్టం పూర్తయ్యింది. వివాహేతర సంబంధం అనుమానంతో తన అక్కను బావ, తండ్రి హింసించి హతమార్చారని ఆమె సోదరుడు సునీల్‌రెడ్డి పెద్దపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై ఉపేందర్‌రావు దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు