కార్యాలయంలోనే విషం సేవించి ఆత్మహత్యాయత్నం
కర్ణాటక, మండ్య : విలేకరి, గ్రా.పం.సభ్యుడి వేధింపులు తాళలేక గ్రా.పం.మహిళా అధికారిణి ఆత్మహత్యకు యత్నించిన ఘటన మంగళవారం భారతీనగర్లో చోటు చేసుకుంది. భారతీనగర్ గ్రా.పం.అధికారిగా విధులు నిర్వహిస్తున్న అనితారాజేశ్వరిపై గ్రా.పం.సభ్యుడు, ఓ వారపత్రిక విలేకరి ఏడాది కాలంగా వేధింపులకు పాల్పడుతున్నారు. గ్రామీణ పోలీసుస్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న తల్లి కమలాక్షితో ఆమె తనగోడు వెల్లబోసుకుంది. వేధింపులు పునరావృతమైతే సహించేది లేదంటూ ఏఎస్ఐ ఆ ఇద్దరినీ హెచ్చరించింది. అయినప్పటికీ వేధింపులు ఆపలేదు. దీంతో మనస్తాపం చెందిన అనితా రాజేశ్వరి మంగళవారం కార్యాలయంలోనే విషం తాగి ఆత్మహత్యకు యత్నించారు. సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఘటనపై భారతీనగర పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.