-
భోపాల్ : ఉద్యోగం కోసం మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన 21 ఏళ్ల యువతిపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్లో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాగర్ నుంచి కజిన్ను కలిసేందుకు భోపాల్కు వచ్చిన యువతి అంతరాష్ట్ర బస్ టెర్మినల్ (ఐఎస్బీటీ)లో దిగారు. అక్కడి నుంచి తన సోదరుడికి ఫోన్ చేయగా ఐఎస్బీటీలో వసతి ఏర్పాట్లు చూడాలని తన స్నేహితుడు ఇద్రిస్ (30)ను కోరాడు. దీంతో ఇద్రిస్ తన స్నేహితులు ఠాకూర్, శర్మలను ఐఎస్బీఐకి పిలిపించాడు. ఆ రాత్రికి అందరూ కలిసి అక్కడే డిన్నర్ చేశారు.
అనంతరం ఇద్రిస్ తన ఇంటికి వెళ్లగా యువతిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లిన ఠాకూర్, శర్మలు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. పోలీస్ వాహనాన్ని చూసిన నిందితులిద్దరూ యువతిని వదిలివేసి పారిపోయారు. కాగా గోవింద్పురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగిందని భోపాల్ డీఐజీ ధర్మేంద్ర చౌధరి తెలిపారు.
నిందితులు ఇద్దరూ ఓ రెస్టారెంట్లో కుక్లుగా పనిచేస్తారని చెప్పారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు ఇద్రిస్ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.