నగరం చూపిస్తానని నరకం చూపించాడు!

17 May, 2019 18:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని పలు పర్యాటక ప్రాంతాలు చూపిస్తానని చెప్పి, ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. నమ్మి వెంట వచ్చిన భార్యను హత్య చేసి పరారయ్యాడు. ఈ సంఘటన అఫ్జల్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల మేరకు.. ఒడిశాలోని బరంపూర్‌కు చెందిన ప్రశాంత్‌ కుమార్‌(32), మధు సుమిత(27) భార్యభర్తలు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌లోని పలు పర్యాటక ప్రదేశాలు చూపిస్తానని చెప్పి, సుమితను నగరానికి తీసుకొచ్చాడు ప్రశాంత్‌. అఫ్జల్‌గంజ్‌లోని శ్రీసాయి లాడ్జిలో రూమ్‌ తీసుకుని బస చేశారిద్దరూ.

ఈ నేపథ్యంలో సుమితను హత్య చేసిన ప్రశాంత్‌ అక్కడినుంచి పరారయ్యాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయటంపై సుమిత బంధువులు మండిపడుతున్నారు. కేసును నీరు గార్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

మరిన్ని వార్తలు