ఇంట్లో లంకె బిందెలు ఉన్నాయంటూ..

5 Jun, 2018 22:19 IST|Sakshi

సాక్షి, ఖమ్మం జిల్లా: ఇంట్లో లంకె బిందెలు ఉన్నాయి..పూజలు చేస్తే ఆ లంకె బిందెల్లోని ఆభరణాలు నీకు లభిస్తాయని మాయమాటలు చెప్పి మహిళపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి గ్రామంలో జరిగింది.

కల్లూరు మండలం యజ్ఞ నారాయణపురం గ్రామానికి చెందిన ఉప్పలమ్మ పూజారి లక్ష్మయ్య ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు