సాక్షి, కర్నూలు: జిల్లాలోని త్రీ టౌన్ పోలీసు స్టేషన్ ఎదుట ఇద్దరు మహిళలు ఆత్మహత్యయత్నానికి పాల్పడటంతో కలకలం రేగింది. తమ కుమారుడిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారంటూ భాదితులు వాపోయారు. 19 లక్షల అప్పుకు సంబంధించిన విషయంలో పోలీసులు తమ కుమారుడిని అక్రమంగా అరెస్టు చేశారని భాదితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలపై పోలీసులు వెంటనే స్పందించాలని వారు డిమాండ్ చేశారు.