గృహిణి అదృశ్యం

25 Jun, 2019 09:11 IST|Sakshi
సంగీత (ఫైల్‌) అంజమ్మ (ఫైల్‌)

రాజేంద్రనగర్‌: ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ గృహిణి కనిపించకుండాపోయిన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పుప్పాలగూడ ప్రాంతానికి చెందిన రమేశ్, సంగీత (19) అలియాస్‌ గౌతమి భార్యాభర్తలు. రమేశ్‌ స్థానికంగా గార్డెన్‌ వర్క్‌ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నెల 20వ తేదీన మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లిన భార్య సంగీత ఇంటికి తిరిగిరాలేదు. దీంతో రమేశ్‌ చుట్టూపక్కల ప్రాంతాలు, బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వెతికినా జాడ కనిపించలేదు. సోమవారం నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరో ఘటనలో బాలిక...
రాజేంద్రనగర్‌: బాలిక కనిపించకుండాపోయిన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. వికారాబాద్‌ జిల్లా కుల్కచర్ల ప్రాంతానికి చెందిన పి.సుందరమ్మ, కూతురు అంజమ్మ (14)తో కలిసి నార్సింగి ప్రాంతంలో కూలీ పని చేస్తూ జీవించేంది. కుమార్తె చేవెళ్లలోని గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఈ నెల 13వ తేదీన అంజమ్మ నార్సింగిలోని తల్లి వద్దకు వచ్చింది. అదే రోజు తల్లి సుందరమ్మ కూతురు అంజమ్మను ఊరికి వెళ్లి ఇంట్లో ఉండాలని తెలిపింది. కానీ అంజమ్మ ఇంటికి చేరకపోవడంతో బంధువుల ఇళ్లల్లో, గురుకుల పాఠశాలలో వెతికింది. కానీ జాడ తెలియకపోవడంతో లేదు. సోమవారం ఉదయం సుందరమ్మ సెల్‌ఫోన్‌కు ఓ వ్యక్తి ఫోన్‌ చేసి ృమీ కూతురు వివాహం జరిగింది’ అని తెలిపాడు. దీంతో ఆమె నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు