కుత్బుల్లాపూర్: భర్త ఎడబాటు భరించలేక ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరానికి చెందిన రాంబాబు, పార్వతి (30) దంపతులు కొన్నేళ్ల క్రితం నగరానికి వలసవచ్చి అంగడిపేట హెచ్పీ పెట్రోల్ బంక్ ప్రాంతంలోని గుడిసెల్లో నివాస ముంటున్నారు. పార్వతి ఓ ప్రైవేట్ సంస్థలో హౌస్కీపింగ్గా పని చేసేది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. కొన్ని నెలలుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండడంతో పార్వతి భర్తకు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో భర్త ఎడబాటును భరించలేక మనస్తాపానికి గురైన ఆమె శనివారం రాత్రి గుడిసెలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసు లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.