విద్యుదాఘాతానికి వృద్ధురాలు బలి

28 Aug, 2018 14:11 IST|Sakshi
లక్ష్మమ్మ మృతదేహం   

ఆత్మకూర్‌ (కొత్తకోట) : ఇంటి ఆవరణలో తెగిపడిన విద్యుత్‌ తీగను పక్కకు తీసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై ఓ వృద్ధురాలు మృతిచెందింది. ఈ సంఘటన సోమవారం మండలంలోని ఆరేపల్లిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, ఏఎస్‌ఐ బీచుపల్లి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బండమీది తెలుగు లక్ష్మమ్మ(62) ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఇంటి ఆవరణలో నడస్తుండగా తన ఇంటికి ఉన్న సర్వీస్‌ వైరు తెగిపడటాన్ని గమనించింది.

ఆ తీగలు పక్కకు తీసేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందింది. ఈమె భర్త ఐదేళ్ల క్రితం చనిపోయాడని, ఈమెకు ఎలాంటి సంతానం లేదని గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్‌ఐ తెలిపారు.

>
మరిన్ని వార్తలు