చెల్లెలి భర్తతో మహిళ పరారీ

10 Aug, 2019 06:56 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కర్ణాటక, హొసూరు: నలుగురు పిల్లలకు తల్లి అయిన ఓ మహిళ చెల్లెలి భర్తతో పరారైన సంఘటన నాగరసంబట్టి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకొంది. తట్రహళ్లి గ్రామానికి చెందిన లారీ డ్రైవర్‌ గోవిందరాజ్, అతని భార్య రమ్య(28) దంపతులకు హేమవర్షిణి(8), అంబికా(6), కోకిల(4), దినేష్‌(2) అనే పిల్లలున్నారు. కొద్ది రోజుల క్రితం రమ్య తన నలుగురు పిల్లలతో సహా అదృశ్యమైంది. చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో గాలించినా జాడ తెలియలేదు. స్థానికుల సమాచారం మేరకు రమ్య చెల్లెలి భర్త కార్తీక్‌తో పరారైనట్లు తెలిసింది. ఈ సంఘటనపై నాగరసంబట్టి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు