ప్రియుడితో గొడవ: 15 ఏళ్ల క్రితం అత్యాచారం చేశాడని..

8 Jun, 2020 16:05 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లక్నో : ప్రియుడు వదిలేశాడన్న కోపంతో.. 15 ఏళ్ల క్రితం అతడు తనపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బాందలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తరప్రదేశ్, కోత్వాలీకి చెందిన ఓ మహిళ వివాహనంతరం కూడా ప్రియుడితో సంబంధాన్ని కొనసాగించింది. దీంతో మహిళ భర్త ఆమెను విడిచి పెట్టేశాడు. ఈ నేపథ్యంలో ఆమె ప్రియుడికి రెండో భార్యగా ఉంటోంది. ( కస్టడీకి దివ్య హత్య కేసు నిందితులు!)

అయితే కొద్దిరోజుల క్రితం ఇద్దరికీ గొడవ జరగటంతో అతడామెను కొట్టి, బయటకు గెంటేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన మహిళ పోలీసులను ఆశ్రయించింది. 15 ఏళ్ల క్రితం అతడు తనపై అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రియుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మహిళను వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు