సాక్షి, గుంటూరు ఈస్ట్: తన స్నేహితుడు బెదిరించి పొలాల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడిచేశాడని అగ్రికల్చరల్ బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ యువతి సోమవారం జరిగిన గుంటూరు అర్బన్ స్పందనలో ఫిర్యాదు చేసింది. పల్నాడు ప్రాంతానికి చెందిన యువతి ఉన్నత చదువుకోసం గుంటూరు నగరంలో గతంలో కోచింగ్ తీసుకుంది. ఆ సమయంలో జేకేసీ కళాశాల ప్రాంతానికి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడగా కొంతకాలానికి ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. చదవండి: కోడలిపై మామ లైంగిక దాడి..
అనంతరం ఆ విద్యార్థినికి వేరే జిల్లాలో అగ్రికల్చర్ బీఎస్సీలో సీటు వచ్చింది. కళాశాలకు సెలవులు ఇవ్వడంతో ఫిబ్రవరి 23వ తేదీ రైలులో స్వగ్రామానికి బయల్దేరింది. ఆ సమయంలో ఆ యువకుడు ఆమెకు ఫోన్ చేసి గుంటూరులో ట్రైన్దిగాలని, లేదంటే యాసిడ్ దాడిచేస్తానంటూ బెదిరించాడు. గుంటూరులో ఆమె రైలు దిగగానే తనపాటు రావాలని బలవంతం చేశాడు. ఆ యువతి ప్రతిఘటించడంతో చెయ్యి చేసుకుని బలవంతంగా ద్విచక్రవాహనంపై అమరావతి రోడ్డులో ఉన్న పొలాల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం లాఫారం వద్ద వదిలి వెళ్లిపోగా స్నేహితులకు ఫోన్లో సమాచారం అందించి వారి సాయంతో ఇంటికి చేరింది. చదవండి: అనంత ఫ్యాక్షన్.. నలుగురికి యావజ్జీవం