మద్యం కావాలంటూ మహిళ వీరంగం

14 Nov, 2018 11:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లండన్‌ నుంచి ముంబై వస్తోన్న ఎయిరిండియా విమానంలో ఓ మహిళ వీరంగం సృష్టించింది. తనకు మరింత మద్యం కావాలంటూ క్యాబిన్‌ సిబ్బందితో గొడవకు దిగింది. విమానంలో నానా హంగామా సృష్టించడంతో సిబ్బంది ఈ విషయాన్ని ముంబై ఎయిర్‌పోర్టు అధికారులకు తెలియజేశారు. ముంబై రాగానే ఆ యువతిని పోలీసులకు అప్పగించారు. విమానంలో హంగామా చేసిన ఆ యువతి ఐర్లాండ్‌ దేశస్తురాలిగా గుర్తించారు. 

మరిన్ని వార్తలు