తాగుడుకు బానిసై యువకుల ఆత్మహత్య

20 Feb, 2019 09:23 IST|Sakshi
సారంగపూర్‌ మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎస్సై

సారంగపూర్‌(నిర్మల్‌): తాగుడుకు బానిసైన యువకులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిర్మల్, ఆదిలాబాద్‌ జిల్లాల పరిధిలో జరిగింది. నిర్మల్‌ జిల్లా సారంగపూర్‌ మండలకేంద్రానికి చెందిన కొండా సంతోష్‌(35) అనే యువకుడు సోమవారం అర్ధరాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం సంతోష్‌ కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఇదే క్రమంలో తాగిన మత్తులో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో అందరు నిద్రించే సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య రాణితోపాటు ఆరేళ్లలోపు కుమారుడు, కుమార్తె, తల్లి లస్మవ్వ ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

తలమడుగు మండలంలో..
తలమడుగు(బోథ్‌): ఆదిలాబాద్‌ మండలం అనుకుంట గ్రామానికి చెందిన దోడె సాయి (20) తలమడుగు మండలంలోని దేవాపూర్‌ గ్రామ సమీ పంలోని అటవీ ప్రాంతంలోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదిలాబాద్‌ వెళ్తున్నానని చెప్పి బైక్‌పై వచ్చినట్లు బంధువులు తెలి పారు. కాగా నిత్యం మద్యం తాగుతుండేవాడని, వారంలో రెండురోజులు మతిస్థిమితం కోల్పోయేవాడని బంధువులు తెలిపారు. సాయి తండ్రి శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామయ్య తెలిపారు. 

మరిన్ని వార్తలు