సాక్షి, రామకుప్పం(చిత్తూరు) : విద్యుత్ స్తంభాన్ని లారీ ఢీ కొనడంతో యువకుడు మృతి చెందిన సంఘటన రామకుప్పం మండలంలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు... రామకుప్పం మండలంలోని అయ్యప్పగానిపల్లెకు చెందిన సుధాకర్ (22) మామిడి కాయలను దించే పని నిమిత్తం బగలనత్తం సమీపంలోని మామిడి తోటకు వెళ్లాడు. మామిడికాయలను లారీలో లోడ్ చేశారు. అనంతరం మామిడి కాయల లారీలోనే బగలనత్తం నుంచి కర్ణాటక రాష్ట్రం శ్రీనివాసపురానికి బయలు దేరాడు. బగలనత్తం సమీపంలో లారీ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఆ సమయంలో విద్యుత్ తీగలు సుధాకర్ మెడకు చుట్టుకుని అక్కడికక్కడే మృతి చెందాడు.