గోదావరి నదిలోకి దూకిన యువకుడు..

8 Jun, 2018 09:09 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : జిల్లాలో ఓ యువకుడు గోదావరి నదిలోకి దూకేశాడు. ఈ ఘటన శుక్రవారం రాజమండ్రి రైలు కమ్‌ రోడ్డు వంతెన వద్ద చోటుచేసుకుంది. వివరాలివి.. కిరణ్‌ అనే యువకుడు తల్లి, సోదరుడితో కలిసి కొవ్వూరి వైపు వెళ్తున్నాడు. అకస్మాత్తుగా వాహనం ఆపేసి వంతెన పై నుంచి గోదావరి నదిలోకి దూకాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆవేదన చెందారు. ఆ తల్లి రోదన మాత్రం ప్రతీ ఒక్కరిని కలచివేసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు