ప్రేమించాలని విద్యార్థినికి బెదిరింపులు

4 Apr, 2018 09:15 IST|Sakshi

కళాశాల వద్దకు చాకుతో వచ్చిన యువకుడు

చిట్టినగర్‌(విజయవాడపశ్చిమం): ప్రేమించాలని వేధింపులకు గురి చేయడమే కాకుండా ప్రేమించకుంటే చంపుతానని చాకుతో కళాశాల వద్దకు వచ్చిన యువకుడిపై కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం..  భవానీపురానికి చెందిన యువతి వన్‌టౌన్‌లోని ఇంజినీరింగ్‌ కళాశాలలో ఎంబీఏ చదువుతంది. ఆ యువతి గతంలో మహాత్మాగాంధీ రోడ్డులోని కాలేజీలో చదివే రోజులలో సీనియర్‌ అయిన చక్రవరం మహేష్‌ ప్రేమించాలని వెంట పడేవాడు. తనకు అలాంటివి ఇష్టం లేదని చెప్పడంతో కొంత కాలం కనిపించకుండా పోయాడు.

ఇటీవల ఆ యువతికి ఫోన్‌ చేసిన  మహేష్‌ తనను ప్రేమించాలని వేధించసాగాడు. మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో కళాశాల వద్ద ఉండగా మహేష్‌ అక్కడకు వచ్చి తనను ప్రేమించాలని వేధించసాగాడు. అంతేకాకుండా మహేష్‌ చేతిలోని ఫోన్‌ కింద చాకు ఉండటంతో ఆ యువతి వెంటనే తన తండ్రికి సమాచారం ఇచ్చింది. తండ్రి వచ్చిన తర్వాత ఆ యువతి కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు