యువకుడి దారుణహత్య

4 Nov, 2017 02:43 IST|Sakshi

పది రోజుల కిందట అదృశ్యమైన యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. మెండెం నుంచి వేరుపడిన అతడి తల, కుడిచేయి ఘటనా స్థలంలో కనిపించలేదు. రెండు రోజుల క్రితం ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

రొద్దం: చోళేమర్రి గ్రామ సమీపాన రవి (23) అనే యువకుడు హత్యకు గురైనట్లు పశువుల కాపరులు శుక్రవారం సాయంత్రం గుర్తించారు. పచ్చపులుసు బాబు పొలంలో వేపచెట్టు వద్ద వేటకొడవళ్లతో హత్య చేసినట్లు అనావాళ్లు ఉన్నాయి. తల, కుడిచేయిని మెండెం నుంచి వేరుచేసి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ మునీర్‌ అహ్మద్‌ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని కుక్కలు, అడవి జంతులు పీక్కుతిన్నట్లు తెలుస్తోంది.

రెండు రోజుల కిందటే హత్య జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. హతుడు రవి తండ్రి రామాంజినప్ప మాట్లాడుతూ ఓ మహిళ విషయంలో ఓ మహిళకు ఫోన్‌ చేశాడనే ఆరోపణతో తన కొడుకు రవిపై పది రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భయపడి పారిపోయాడని వాపోయాడు. ఫిర్యాదు చేసిన వారే తన కుమారుడిని దారుణంగా నరికి చంపి ఉంటారని కన్నీటి పర్యంతమయ్యాడు. హతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

మరిన్ని వార్తలు