శ్రీకాకుళం, రణస్థలం: మండలంలోని పాతర్లపల్లి గ్రామానికి చెందిన లంక సంతోషి(18) అనే యువతి కడుపు నొప్పి భరించలేక పురుగులు మందు తాగి సోమవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడిందని జె.ఆర్.పురం ఎస్ఐ బి.అశోక్బాబు తెలిపారు.
యువతి పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకోవడాన్ని గుర్తించిన తల్లిదండ్రులు వెంటనే శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మరణించిందని ఎస్ఐ పేర్కొన్నారు. మృతురాలి తండ్రి సత్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.