పెళ్లి ఇష్టంలేక యువతి ఆత్మహత్య

10 Apr, 2018 06:31 IST|Sakshi
మృతురాలు అశ్విని

సాక్షి, పరిగి: తను వద్దంటున్నా పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకుంది. శ్రీరంగరాజుపల్లికి చెందిన నాగలూరప్పకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇంటర్‌ వరకు చదువుకున్న పెద్ద కుమార్తె కురుబ అశ్విని (22) హిందూపురం పరిధిలోని తూముకుంట చెక్‌పోస్టు వద్ద గార్మెంట్స్‌ పరిశ్రమలో పని చేస్తోంది. ఈమెకు తల్లిదండ్రులు పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తున్నారు.

తనకు ఇప్పుడే వద్దని, మరికొంతకాలం ఆగాలని అశ్విని తల్లిదండ్రులకు చెప్పింది. అయినప్పటికీ గత ఆదివారం పెళ్లి విషయమై మరోసారి చర్చలు జరిగాయి. దీంతో మనస్తాపం చెందిన అశ్విని సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పైకప్పునకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొద్దిసేపటి తర్వాత వచ్చిన చెల్లెలు గమనించి, స్థానికుల సాయంతో మృతదేహాన్ని కిందకు దించారు. ఏఎస్‌ఐ హబీబుల్లా, కానిస్టేబుల్‌ రాజు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు