పెళ్లి కావడంలేదని  యువతి ఆత్మహత్య

15 Jan, 2019 09:19 IST|Sakshi

బోయినపల్లి(చొప్పదండి) : మండలంలోని స్తంభంపల్లి గ్రామానికి చెందిన తంగళ్లపల్లి అనిత(27) తనకు వివాహం కావడం లేదనే మనస్తాపంతో సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని ఎస్సై పాకాల లక్ష్మారెడ్డి తెలిపారు. అనిత కొంత లావుగా ఉండడంతో వివాహ సంబంధాలు కుదరడం లేదు.. సంబంధాలు వచ్చి వెళ్లడంతో  మానసికంగా కుంగిపోయింది. 15 రోజులుగా ఆరోగ్యంగా ఉండడం లేదు. దీంతో తల్లిదండ్రులు మానసిక వైద్యుని వద్ద చికిత్స చేయించారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఇంట్లోనే పురుగుల మందు తాగింది.  విషయం తెలిసిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం వేములవాడ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అనిత మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వివాహం కావడం లేదనే మానసిక బాధలతో తన కూతురు అనిత ఆత్మహత్య చేసుకుందని ఆమె తండ్రి తిరుపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసుదర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

మరిన్ని వార్తలు