యువతి దారుణ హత్య

13 Nov, 2019 07:44 IST|Sakshi
హత్యకు గురైన అంజలి (ఫైల్‌)ఘటనాస్థలంలో గుమిగూడిన జనం

గొంతుకోసి హత్య చేసిన దుండగులు

దొడ్డబళ్లాపురం: గొర్రెలు మేపుకుంటున్న యువతిపై దాడి చేసిన దుండగులు గొంతు కోసి దారుణంగా హత్యచేసిన సంఘటన దొడ్డ గ్రామీణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని లింగనహళ్లిలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. గ్రామం నివాసి అంజలి (20) హత్యకు గురైంది. గ్రామం శివారులో గొర్రెలు మేపుకుంటున్న అంజలిపై దాడి చేసిన దుండగులు ఆమె ప్రతిఘటించడంతో గొంతుకోసి హత్య చేశారు. ఈ హత్య ఎవరు, ఎందుకు చేసారనే వివరాలు తెలిసిరాలేదు. అత్యాచారయత్నం చేసారా? కక్షలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. గ్రామస్తులు మాత్రం గ్రామంలో యువతిని ప్రేమిస్తున్నానని వెంటబడుతున్న యువకుడిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు