అవమానంతో యువతి ఆత్మహత్య

15 May, 2019 10:39 IST|Sakshi
మృతి చెందిన పుష్పారాణి

చిత్తూరు, పుంగనూరు : పట్టణంలోని మేలుపట్లలో నివాసం ఉంటున్న చిన్నప్ప కుమారై పుష్పారాణి(24) అవమానంతో సోమవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పొలీసుల కథనం మేరకు.. పుష్పారాణి నాయుడుపేటలోని ఓ ప్రైవేటు ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తోంది. ఈమెకు సమీప బంధువైన సోమల మండలం పట్రపల్లెకు చెందిన గుణశేఖర్‌తో వివాహం నిశ్చయమైంది.

ఇదిలా ఉండగా, పుష్పారాణి నాయుడుపేటలో ఒక యువకుడితో సన్నిహితంగా ఉందన్న అనుమానంతో గుణశేఖర్, అతని సోదరుడు రేవంత్‌ కలిసి నాయుడుపేటకు వెళ్లి సదరు యువకుడిపై దాడి చేశారు. పుష్పారాణిని అవమానపరిచారు. తనకు జరిగిన అవమానాన్ని సోమవారం రాత్రి పుష్పారాణి తల్లికి వివరించింది. తల్లి పట్టణంలోకి వెళ్లి వచ్చేలోపు ఇంటిలోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇరుగుపొరుగువారు ఆమెను కాపాడేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. కేసు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు