యువతి అదృశ్యం

23 May, 2020 08:31 IST|Sakshi
నేహ బేగం (ఫైల్‌)

కాచిగూడ: యువతి అదృశ్యమైన ఘటన కాచిగూడ పోలీసుస్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ టీ.మధు తెలిపిన వివరాల ప్రకారం.. గోల్నాకలోని మౌలనా ఆజాద్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ ఫరూఖ్‌ కూతురు నేహ బేగం. ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం చదువుతోంది. ఈ నెల 20న తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రా లేదు. దీంతో ఆమె తల్లి రహీమాబేగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు